YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యాదాద్రి యదగిరీశుని స‌న్నిధిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు

యాదాద్రి యదగిరీశుని స‌న్నిధిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు

యాదాద్రి భువ‌న‌గిరి ఏప్రిల్ 25
యాదాద్రి యదగిరీశుని  స‌న్నిధిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ధానాల‌యంలో స్వామి వారిని కేసీఆర్ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం కేసీఆర్ దంప‌తుల‌ను అర్చ‌క బృందం ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.ఆ త‌ర్వాత రామ‌లింగేశ్వ‌ర స్వామి ఆల‌య ఉద్ఘాట‌న క్ర‌తువులో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ పాల్గొన్నారు. మ‌హా పూర్ణాహుతి, మ‌హాకుంభాభిషేకం పూజ‌ల్లో పాల్గొన్నారు. తోగుట పీఠాధిప‌తి మాధ‌వానంద స‌ర‌స్వ‌తి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాట‌న క్ర‌తువును నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.

Related Posts