YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళా కమిషన్ నోటీసులకు స్పందించేది లేదు బోండా

మహిళా కమిషన్ నోటీసులకు స్పందించేది లేదు బోండా

విజయవాడ
రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు.  వాసిరెడ్డి పద్మ తీరు హేయంగా ఉందన్నారు. ‘‘మహిళా చైర్ పర్సన్గా ఉండి... మీరు చేస్తుంది ఇదేనా’’ అని ప్రశ్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారన్నారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు స్పందించిందే లేదన్నారు. దీనిపైన తాము న్యాయ పోరాటానికి సిద్ధమని బోండా ఉమ స్పష్టం చేశారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. తూ తూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు తాము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. సోమవారం విజయవాడ అత్యాచార బాధితురాలు, తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు బోండా ఉమ వినతి పత్రం అందజేశారు

Related Posts