YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ పర్యటన

విజయనగరంలో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ పర్యటన

విజయనగరం
విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి డా మన్ సుఖ్ మాండవీయ పర్యటించారు.  రూరల్ మండలం గుంకలాం లో జగనన్న హౌసింగ్ కాలనీ లే అవుట్ ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు.  గృహ నిర్మాణ లే అవుట్ విశేషాలను కేంద్ర మంత్రి కి  జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వివరించారు. రాష్ట్రంలో అతి పెద్ద లే అవుట్లలో ఇదొకటని  జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వివరించారు. గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన నీరు, విద్యుత్, రోడ్లు తదితర వసతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు అయన తెలిపారు. జిల్లాలో లో 82 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామని కేంద్ర మంత్రి కి  జాయింట్ కలెక్టర్ వివరించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ  కేంద్రం ప్రవేశ పెట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఈ రాష్ట్రమేనని పేర్కొన్నారు. లబ్దిదారులు ఈ పథకం ద్వారా ఎలా ఇళ్లు నిర్మించుకుంటు న్నదీ అయన తెలుసుకున్నారు. తరువాత  బొండపల్లి మండలం గొట్లాం లో నాడు - నేడు కింద ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను అయన సందర్శించి,  విద్యార్థులతో మాట్లాగారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర మంత్రి కి  విద్యార్థులు వివరించారు.
తరువాత అయన  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.   మంత్రి వెంట పర్యటనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్. మాధవ్, శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడు, బి.జె.పి.నాయకులు పాల్గోన్నారు.

Related Posts