YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..

‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..

అనంతపురం, ఏప్రిల్ 27,
డిగ్రీ కోర్సులకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. కొన్నేళ్లుగా ఇంజినీరింగ్‌ కోర్సుల వైపు విద్యార్థులు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ డిగ్రీ కోర్సులు చేసినా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చుననే ఆత్మవిశ్వాసం విద్యార్థుల్లో కనిపిస్తోంది. డిగ్రీ కోర్సులు పూర్తి చేసి మేనేజ్‌మెంట్‌ వైపు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య  గణనీయంగా పెరుగుతోంది. దీంతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తున్న వారు ఎంబీఏ, కామర్స్‌ కోర్సుల వైపు మొగ్గుచూపి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు దీటుగా వేతనాలు పొందుతున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి సంఖ్య 14వేల పైచిలుకు ఉంది. రాయలసీమలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఎక్కువ అడ్మిషన్లు జరిగింది అనంతపురం జిల్లాలోనే కావడం విశేషం. తాజాగా 2021–22 సంవత్సరానికి సామాజిక ఆర్థిక (సోషియో ఎకనామిక్‌) సర్వేలో పలు విషయాలు వెల్లడించారు.ఉత్తరాదిన ఇంజినీరింగ్‌ విద్య నామమాత్రంగా ఉంటుంది. 90 శాతం మంది డిగ్రీ కోర్సులవైపే మొగ్గుచూపుతారు. డిగ్రీ కోర్సులు చేయడానికి ఉత్తరాదిలో చాలామంది ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో 90వేల సీట్లుంటే..అన్నీ భర్తీ అవుతాయి. అంటే డిగ్రీ కోర్సులకు దేశంలోనే ఢిల్లీలో క్రేజ్‌ ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. గత ఏడాది అనంతపురం జిల్లాలో 14,342 మంది విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ.ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరిన వారి సంఖ్యను చూస్తే రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా రెండో స్థానంలో    ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 17,921 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరగా, ఆ తర్వాతి స్థానంలో 14,342 అడ్మిషన్లతో ఉమ్మడి   అనంతపురం జిల్లా నిలిచింది. అందులోనూ అత్యధికగా బీసీ విద్యార్థులు 8,190 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. 4,260 మంది ఎస్సీ విద్యార్థులు, 827 మంది ఎస్టీలు డిగ్రీ కోర్సుల్లో చేరారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 30,311 అడ్మిషన్లు జరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉండగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్న వారి  సంఖ్య 1,924 మాత్రమే.ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన నూతన సిలబస్‌ ప్రకారం యూజీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌ కోర్సుతో సెలవు రోజుల్లో ఉద్యోగాధారిత శిక్షణ ఇవ్వడానికి వీలు కలుగుతోంది. స్కిల్‌ ఆధారిత కోర్సులు పూర్తిచేయాలని నిర్దేశించారు. పరిశ్రమల ప్రాజెక్ట్‌లూ  పూర్తి చేయాల్సి ఉంది. ఫలితంగా కోర్సు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు అధికంగా అడ్మిషన్లు పొందారు.  

Related Posts