YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో గులాబీ పాత్ర అద్వితీయం

తెలంగాణలో గులాబీ పాత్ర అద్వితీయం

హైదరాబాద్, ఏప్రిల్ 27,
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం చేసిన‌ అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందు అడుగు వేశారని క‌విత గుర్తు చేశారు.చిన్న రాష్ట్రాల ఆవిర్భావం అనే అంశం, దేశ రాజకీయాలు, జాతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్న సమయంలో, తన రాజకీయ చతురతను ప్రదర్శించి, దేశంలోని వివిధ పార్టీల మద్దతును కేసీఆర్ కూడ‌గ‌ట్టార‌ని పేర్కొన్నారు. మొదటిసారిగా తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండాలో చేర్చి , రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించి, వివిధ పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించార‌ని తెలిపారు. అంతిమంగా రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగ బద్ధంగా, శాంతియుతంగా, దేశ భౌగోళిక చిత్రపటాన్ని మారుస్తూ 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో టిఆర్ఎస్ పాత్ర అద్వితీయం అని క‌విత ప్ర‌శంసించారు.రాష్ట్ర సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. వారితో నడిచిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రజలు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈరోజు మన గులాబీ జెండా, టీఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న క్ష‌ణాన ఆనందంగా ఉంద‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌.

Related Posts