YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషం

హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషం

హైదరాబాద్,  మే 12,
మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ముందున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు.తెలంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద సెంటర్‌ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. కాల్‌అవే గోల్ఫ్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.లంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద సెంటర్‌ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.కాల్‌అవే గోల్ఫ్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Related Posts