హైదరాబాద్, మే 12,
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు గురువారం (మే 12) విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్ టికెట్ల ను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి పొందవచ్చని సూచించారు.మే 12 విద్యాశాఖ వెబ్సైట్లో కూడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు తెలిపారు. కాగా మే 23 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పరీక్షలకు అరగంట సమయాన్ని అదనంగా కేటాయించిన విషయం తెలిసిందే. అంటే ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.