YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా రాజీవ్ కుమార్

కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా రాజీవ్ కుమార్

న్యూ డిల్లీ మే 12
కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా రాజీవ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా ఉన్న సుశీల్ చంద్ర ప‌ద‌వీ కాలం ఈ నెల 14 తో ముగియ‌నుంది. ఈ నెల 15 న నూత‌న ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా రాజీవ్ కుమార్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఏప్రిల్ మాసంలో ఈ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. చాలా సంవ‌త్స‌రాలుగా ఆయ‌న నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ముందు నుంచి కూడా కేంద్ర ప్ర‌భుత్వంలో ఓ థింక్ ట్యాంక్‌గా ఉంటూ వ‌స్తున్నారు.నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌గా అర‌వింద్ ప‌ణ‌గారియా దిగిపోయిన త‌ర్వాత రాజీవ్ కుమార్ ఈ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంత‌కు ముందు పూణెలోని గోఖ‌లే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పొలిటిక‌ల్ అండ్ ఎకనామిక్స్‌కి ఛాన్స‌ల‌ర్‌గా ఉన్నారు. అలాగే ల‌క్నోలోని గిరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌కి బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

Related Posts