YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కన్నీటి పర్యంతమైన ప్రధాని మోడీ..

కన్నీటి పర్యంతమైన ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ మే 12
దేశ ప్రధాని నరేంద్ర మోడీ చాలా గంభీరంగా ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన రూపాన్ని చూడడం కూడా కష్టమే.. అదేసమయంలో చాలా సందర్భాల్లో ఆయన చలాకీగా కూడా ఉంటారు. జోకులు వేస్తారు.. ప్రజలతో కలిసి.. నవ్వుతారు. కానీ ఎప్పుడూ కూడా కంటతడి పెట్టడం.. వలవలా..కన్నీరు కార్చడం వంటివి మనకు తెలియదు. అసలు దేశాధినేతకు అంత అవసరం ఎందుకు వస్తుంది..!!
అయితే.. ప్రధాని మోడీ.. తాజాగా కన్నీరు పెట్టారు. అది కూడా వర్చువల్గా జరుగుతున్న సమావేశంలో ఆయన ఒక్కసారిగా కన్నీటి పర్యంతమై..రెండు కళ్లను తన తువాలుతో ఒత్తుకున్నారు.  ఈ హఠాత్పరిణా మంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. మరి ఆ ఘటన ఏంటి? ఎందుకు జరిగింది? అంటారా?  తీవ్ర భావోద్వేగం నిండిన ఆ సన్నివేశం... ఈ రోజు ఢిల్లీలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు దృష్టి లోపంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కుమార్తెతో మాట్లాడుతూ ప్రధాని మోడీ.. ఒక్కసారిగా కంట తడి పెట్టారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్లోని భరుచ్ నగరంలో నిర్వహించిన 'ఉత్కర్ష్ సమారోహ్' కార్యక్రమంలో వర్చువల్గా హాజరై లబ్ధిదారులతో మాట్లాడారు మోడీ. ఈ సందర్భంగా.. అంధుడైన ఓ లబ్ధి దారుడిని.. 'మీ కుమార్తెలను ఉన్నత చదువులకు పంపిస్తారా?' అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. దీంతో అతను.. తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరు డాక్టర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు. అక్కడే ఉన్న అతని కుమార్తెను లైన్లోకి పిలిచిన మోడీ.. 'వైద్య విద్యనే ఎందుకు ఎంచుకున్నావ'ని అతడి కుమార్తెను మోడీ అడిగారు. దానికి 'నా తండ్రి పడుతున్న బాధను చూసి నేను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. నా తండ్రి అంధుడు కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యను వైద్యంతో నివారించాలనేది నాలక్ష్యం' అని సమాధానమిచ్చింది యువతి.ఆమె సమాధానం విన్న మోడీ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఆ వెంటనే ఆయన కంటివెంబడి జలజలా కన్నీరు ఉబికి వచ్చింది. కొన్ని క్షణాల పాట మౌనంగా ఉండిపోయారు. భుజంపై ఉన్న తువాలును తీసుకుని.. రెండు కళ్లనూ అద్దుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత సర్డుబాటు చేసుకుని.. ''నీ ప్రేమే నీ బలం'' అంటూ యువతిని మెచ్చుకున్నారు.
వితంతువులు వృద్ధులు నిరాశ్రయులకు ఆర్థిక సాయం అందించే నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు 100 శాతం లబ్ధిదారులకు అందుతున్న క్రమంలో.. 'ఉత్కర్ష్ సమారోహ్' కార్యక్రమాన్ని నిర్వహించింది భరుచ్ జిల్లా యంత్రాంగం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ...'ప్రభుత్వ పథకాలు 100 శాతం ప్రజలకు చేరువవటం వల్ల వివక్షకు తెరపడింది. ఇప్పుడు వాటి ప్రయోజనాలు పొందేందుకు సిఫార్సులు అవసరం లేదు. అలాగే.. బుజ్జగింపు రాజకీయలకు సైతం ముగింపు పలికినట్లయింది. ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవటం వల్లే అవి కాగితంపైనే ఉండటం లేదా అర్హులు కాని వారు వాటి ప్రయోజనాలు పొందటం వంటివి జరుగుతున్నాయి.' అని మోడీ పేర్కొన్నారు.

Related Posts