హైదరాబాద్ మే 12
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంజయ్వి హాస్యాస్పదమైన, ఆధార రహితమైన ఆరోపణలు అని కేటీఆర్ పేర్కొన్నారు. సంజయ్.. ఆధారాలుంటే నిరూపించు.. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రచారం కోసం సంజయ్ వాక్చాతుర్యం ప్రదర్శించొద్దు. నిరాధార ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.