YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: మంత్రి ఎర్రబెల్లి

పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: మంత్రి ఎర్రబెల్లి

జనగామ
రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలని అదికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం చిన్నగూడూరులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు.ఈ సందర్భంగా రైతులు.. ధాన్యం రవాణా సమస్య ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదని రైతులు చెప్పిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తేవాలని రైతులకు సూచించారు.

Related Posts