YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫెన్షన్ కోసం భర్త డెత్ సర్టిఫికెట్

ఫెన్షన్ కోసం భర్త డెత్ సర్టిఫికెట్

కడప, మే 16,
పెన్షన్ కోసం.. కట్టుకున్న భర్త బతికుండగానే ‘ చంపేసింది’ ఓ మహిళా వాలంటీర్. అంటే హత్య చేయలేదు. భర్త బతికుండగానే చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించి పెన్షన్ పొందుతోంది. ఈ సంఘటన పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది ఓ మహిళా వాలంటీర్ కావడం విశేషం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చక్రాయపేట మండలానికి చెందిన బళ్లారి సుభాహాన్ బాషా అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఏడాదిన్నర కుమారుడున్నాడు. ఐతే భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో విడిగా ఉంటున్నారు.ఈ క్రమంలో భార్య వాలంటీర్ గా పనిచేస్తోంది. ప్రతినెల ఒకటవ తేదీన పెన్షన్లు పంచడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమోదు చేస్తుండటంతో పథకాలు ఎంలా పొందాలి, ఎలా సర్టిఫికెట్లు మార్చాలి, అర్హతలను ఎలా చూపించాలనేదానిపై పట్టు సాధించింది. దీంతో భర్తకు దూరంగా ఉంటున్న తనకు వితంతు పెన్షని రాయించుకోవాలన్న ఆలోచనతో రావడంతో.. వెంటనే రంగంలోకి దిగి బ్రతికున్న భర్త చనిపోయాడంటూ వీఆర్వో సాయంతో సర్టిఫికెట్ సృష్టించింది. వెంటనే సచివాలయంలో నమోదు చేయించుకోని వితంతు పింఛన్ కార్డు పొందింది చక్కగా పెన్షన్ తీసుకుటోంది.అయితే ఇటీవల.. విషయం తెలియక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం పొందడానికి భర్త సుభాహాన్ చక్రాయపేటలోని గ్రామ సచివాలయం సిబ్బందిని కలిసి దరఖాస్తు చేశాడు. ఐతే రేషన్ కార్డులో పేరు తొలగించిన కారణంగా పథకం వర్తించే అవకాశం లేదని సిబ్బంది తెలిపారు. దీంతో ఖంగుతిన్న సుభాహాన్.. తన పేరును ఎలా తొలగిస్తారని ఆరా తీశాడు. అతడు మరణించినట్లు నమోదైందని సిబ్బంది వివరించడంతో షాక్ తిన్నాడు.   వెంటనే   రాయచోటికి వెళ్లి తహసీల్దార్ను కలిశాడు. కొత్తపల్లి  గ్రామ సచివాలయానికి చెందిన వీఆర్వో యోగాంజనేయ రెడ్డి లాగిన్ ద్వారా ఆన్లైన్లో మరణించినట్లు నమోదైనట్లు అధికారులు గుర్తించి.. అధికారులు ఆరా తీయగా భార్యే వీఆర్వోతో కలిసి ఈ పని చేసినట్లు తేలింది. దీంతో అక్రమంగా తాను చనిపోయినట్లు రికార్డులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.

Related Posts