YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

నేపాల్ లో ప్రదాని మోదీకి ఘ‌నంగా స్వాగ‌తం

నేపాల్ లో  ప్రదాని మోదీకి ఘ‌నంగా స్వాగ‌తం

న్యూ ఢిల్లీ మే 16
ప్ర‌ధాని నరేంద్ర మోదీ నేపాల్ లో  సోమ‌వారం నుంచి నాలుగు రోజ‌లు పాటు ఆయ‌న నేపాల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నేపాల్‌లో స‌రిహ‌ద్దు స‌మ‌స్య ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. మోదీ నేపాల్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం. ప్ర‌ధాని మోదీ నేపాల్ చేరుకోగానే నేపాల్ ప్ర‌ధాని, ఆయ‌న భార్య‌, ప‌లువురు మంత్రులు మోదీకి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత మోదీ బుద్ధ పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకొని అక్క‌డి మాయా దేవి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌యం పక్క‌నే వున్న స్తంభం దగ్గ‌ర ప్ర‌ధానులిద్దరూ దీపాలు వెలిగించారు. ఆ త‌ర్వాత బోధి వృక్షానికి నీళ్లు పోశారు. ఆ త‌ర్వాత బౌద్ధ సంస్కృతి, వార‌సత్వ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు.

Related Posts