YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్రేకింగ్ న్యూస్ పేరుతొ ప్రకాష్ రాజ్ ట్వీట్స్

బ్రేకింగ్ న్యూస్ పేరుతొ ప్రకాష్ రాజ్ ట్వీట్స్

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విలక్షణ తాజా రాజకీయ పరిణామాలపై వరుస ట్వీట్‌‌లతో విరుచుకుపడ్డారు. కర్ణాటక బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఆయన పెట్టిన ట్వీట్‌లకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.‘ప్రియమైన రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలూ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో తొందరొద్దు, నిరాశ పడవద్దు. ముందు మీ సామర్థ్యాన్ని, మీరెవరన్నది సభలో రేపు సాయంత్రం 4 గంటల్లోగా నిరూపించుకోండి. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోండి.. సర్వోన్నత న్యాయస్థానం ఎదురులేనిది’ అని ట్వీట్ చేశారు. రిసార్ట్ మేనేజర్లు కూడా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వామని కోరాలి... ఎందుకంటే 116 మంది ఎమ్మెల్యేలు అందులోనే ఉన్నారు.. ఆట మొదలైంది కాబట్టి... అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు’ ‘ఇది బహిరంగ రహస్యం.. ఓ వ్యక్తి తియ్యగా మాట్లాడి విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు.. ప్రజలను పిచ్చివాళ్లను చేశారు.. మరోసారి ఫూల్స్‌ను చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. 104 + జీఎస్టీ 9 శాతం= 113’ అంటూ బీజేపీ విరుచుకుపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామనాన్నారు.. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు.. ఒకసారి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత వాటిని మీ ఖాతాల్లో ప్రతికూల నిల్వ కింద జీఎస్టీ, టీడీఎస్‌లో డిపాజిట్ చేస్తారు’ కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ, ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించడం విశేషం. 

Related Posts