YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సరికొత్త రాజకీయానికి తెర

సరికొత్త రాజకీయానికి తెర

టిట్ ఫర్ టాట్ అంటోంది కాంగ్రెస్, ఆర్జేడీ. ఇదే ఫార్ములాను అనుసరిస్తూ సరికొత్త రాజకీయాన్ని తెరపైకి తెస్తున్నాయి. కర్ణాటకలో అతిపెద్ద పార్టీకే అవకాశం ఇవ్వాలన్న గవర్నర్ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ... గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్... బీహార్‌లో ఆర్జేడీ ఇదే వ్యూహానికి పదును పెట్టాయి. అతిపెద్ద పార్టీలుగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ మూడు రాష్ట్రాల్లో నేతలు గవర్నర్‌ను కలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లో ఆర్జేడీ నేత మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్) నేతలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు. బీహార్‌ అసెంబ్లీలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ కాబట్టి... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తమను ఆహ్వానించాలంటూ వినతి పత్రం సమర్పించారు. మా మెజార్టీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తేజస్వీ గవర్నర్‌తో భేటీ తర్వాత చెప్పారు. ఇదే అంశాన్ని సత్యపాల్‌కు వివరించామని... 111మంది ఎమ్మెల్యేల బలం ఉందన్నారు. జేడీయూలోని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. ఇటు గోవాలోనూ కాంగ్రెస్ ఇదే స్ట్రాటజీని అనుసరించింది. ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర గవర్నర్‌ మృధులా సిన్హాను కలిశారు. కర్ణాటకలో లాగే... సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మొమరాండం ఇచ్చి విజ్ఞ‌ప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే వారంలోగా మెజార్టీని నిరూపించుకుంటామన్నారు. మణిపూర్‌లోనూ కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ జగదీష్ ముఖితో భేటీ అయ్యారు. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కోరారు. మాజీ సీఎం ఇబోబి సింగ్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. గోవా, బీహార్, మణిపూర్‌లో కర్ణాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కారణంగా చూపిస్తూ... కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహంతో పావులు కదుపుతోంది. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారతోయే లేదో అంశాన్ని పక్కన పెడితే... బీజేపీ అనుసరించిన వ్యూహంతోనే వారినే ఇరకాటంలో పెట్టేందుకు సరికొత్త ఎత్తును తెరపైకి తెచ్చింది.

Related Posts