YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో చ‌దువుకొనేందుకు ఫెలోషిప్‌ను ప్ర‌క‌టించిన క్వాడ్ దేశాలు

అమెరికాలో చ‌దువుకొనేందుకు ఫెలోషిప్‌ను ప్ర‌క‌టించిన  క్వాడ్ దేశాలు

టోక్యో మే 24
క్వాడ్ దేశాలు ఇవాళ క్వాడ్ ఫెలోషిప్‌ను ప్ర‌క‌టించాయి. జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిడా, భార‌త ప్ర‌ధాని మోదీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్ర‌ధాని ఆంథోనీ అల్బ‌నీస్ సంయుక్తంగా ఈ ప్ర‌క‌ట‌న చేశారు. క్వాడ్ ఫెలోషిప్ పొందే విద్యార్థులు అమెరికాలో చ‌దువుకోవ‌చ్చు. అయితే ఈ నాలుగు దేశాల‌కు చెందిన వంద మంది విద్యార్థుల‌కు అమెరికాలో చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పిస్తారు. ఆస్ట్రేలియా, ఇండియా, జ‌పాన్‌, అమెరికా విద్యార్థుల‌కు స్పాన్స‌ర్‌షిప్ ఇస్తారు. గ్రాడ్యుయేట్‌, డాక్ట‌రేట్ ప్రోగ్రామ్‌ల‌ను విద్యార్థులు పూర్తి చేయ‌వ‌చ్చు. సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్ రంగాల్లో ఈ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. క్వాడ్ ఫెలోషిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని భార‌తీయ విద్యార్థుల‌ను ప్ర‌ధాని మోదీ కోరారు.

Related Posts