హైదరాబాద్, జూన్ 22,
యువకుడి అస్తిపై కన్నేసిన మ్యాట్రిమోనిలో పనిచేస్తున్న రీనా అనే యువతి ముగ్గులోకి దింపింది. అతడి ఆస్తి కొట్టెయ్యాలని పెళ్లినాటకం ఆడింది పెళ్లిసంబంధాలు చూడాలంటూ మ్యాట్రిమోనిని ఆశ్రయించిన ఓ యువకుడికి చుక్కలు చూపింది ఓ యువతి. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి అస్తిపై కన్నేసిన మ్యాట్రిమోనిలో పనిచేస్తున్న రీనా అనే యువతి ముగ్గులోకి దింపింది. అతడి ఆస్తి కొట్టెయ్యాలని పెళ్లినాటకం ఆడింది. పెళ్లికి ముందే తనకు తెలిసిన కంపెనీలో ఆరున్నర కోట్ల వరకు పెట్టుబడి పెట్టించింది. తీరా పెళ్లైన పదిహేను రోజులకే విడిపోయింది. ఎందుకిలా చేశావంటూ నిలదీసిన యువకుడిని రౌడీలతో కొట్టించింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడి సోదరి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో ఉంటున్న రవికుమార్ రెండున్నరేళ్ల నుంచి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. మ్యాట్రిమోని నిర్వహిస్తున్న రీనా గొర్లె పరిచయమైంది. ఈ పరిచయం పెళ్లిదాకా వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రీనా – రవి పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత రీనా అసలు రూపం బయటపెట్టడంతో రవికుమార్ సోదరి పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రీనాతో పాలు మరికొందరిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.