YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

మహారాష్ట్రలో  రాజకీయ సంక్షోభం

ముంబై, జూన్ 22,
మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర సర్కార్‌కు రాజకీయ సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే సూరత్‌ నుంచి గౌహతి చేరుకున్నారు. తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు. పార్టీకి విధేయులని భావించి మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం పెద్ద పెనుగాలి వీచింది. శివసేనపై తిరుగుబాటు చేసిన తర్వాత, ఈ రెబల్ ఎమ్మెల్యేలందరూ గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హోటల్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం షిండేతో పాటు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి గౌహతికి చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో గౌహతి తరలించారు. గౌహతిలోని ఎమ్మెల్యేలంతా బస చేసిన హోటల్‌కు హైలెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.అయితే నిన్న అరగంట వరకు సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో ఫోన్‌లో మాట్లాడుకున్నా.. ఫలితం కనిపించలేదు. బాల్‌థాక్రే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తామంటూ తేల్చి చెప్తున్నారు ఏక్‌నాథ్‌ షిండే. మహరాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే శివసేనలో చీలిక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.సూరత్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఏక్‌నాథ్‌ షిండే.. బాల్‌ థాకరే అనుసరించిన హిందుత్వ విధానాలకు తామే అసలు వారసులమని ప్రకటించారు. హిందుత్వవాదంతో కూడిన శివసేనను వీడలేదని స్పష్టం చేశారు. మహా వికాస్‌ అగాఢీ ప్రభుత్వం గురించి ప్రస్తుతం తాము ఏం మాట్లాడబోమని అన్నారుఆ. నా వెంట మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో 34 మంది శివసేన, 7 మంది స్వతంత్రులు ఉన్నారని పేర్కొన్నారు. మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్‌తో షిండే భేటీ కానున్నారు. తనతో 2/3 పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, దీంతో శివసేన పార్టీ తనదేనని ఆయన క్లయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు షిండే లేఖ ఇవ్వనున్నారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయనున్నారు.అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు ఉన్న సంఖ్యాబలం 55. ఇందులో 33 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారంటూ ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించుకున్నారు. ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే శివసేన తిరుగుబాటు శాసన సభ్యులందరూ గుజరాత్‌ను వీడి అసోంకు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంలో నిమిషానికో ట్విస్ట్‌
మహారాష్ట్ర రాజకీయంలో నిమిషానికో ట్విస్ట్‌ వస్తోంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పంపిన సంకేతాలు కీలకంగా మారాయి. అవసరమైతే ప్రభుత్వ రద్దు పరిశీలిస్తామని ఆయన సంకేతాలు పంపారు. బలంలేకపోతే అసెంబ్లీ రద్దు చేస్తామని సంజయ రౌత్‌ ట్వీట్‌ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇవే సిగ్నల్స్‌ ఇచ్చారు. ఏక్‌నాథ్‌ షిండేతో చర్చలు జరుగుతున్నాయని శివసేన నేతలు చెబుతున్నారు. ఇవాళ ఉదయం కూడా గంటపాటు షిండేతో మాట్లాడినట్లు శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ చెప్పారు. 40 ఏళ్ల నుంచి షిండే తనకు మిత్రుడని.. శివసైనికుడైన షిండే శివసేనలోనే ఉంటారని చెప్పుకొచ్చారు.ఉద్దవ్‌ థాక్రే సర్కార్‌పై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండే వర్గం సూరత్‌ నుంచి గౌహతి చేరుకుంది. సూరత్‌ నుంచి చార్టెట్‌ ప్లైట్‌లో గౌహతి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి వారిని ప్రైవేటు హోటల్‌కు తరలించారు. విమానంతో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? అనే వివరాలు బయటకు రాలేదు. మూడు బస్సుల్లో ఎమ్మెల్యేలను తరలించారు.తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ షిండే అంటున్నారు. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా తనకు మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని ఆయన పేర్కొన్నారు. షిండేతో పాటు 33 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Related Posts