YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొడాలి, వల్లభనేనిలే టార్గెట్ గా అడుగులు

కొడాలి, వల్లభనేనిలే టార్గెట్ గా అడుగులు

విజయవాడ, సెప్టెంబర్ 20, 
రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు…జగన్‌పై ఎంత ఆగ్రహంతో ఉన్నాయో తెలియదు గాని…కొడాలి నాని, వల్లభనేని వంశీలపై అంతకంటే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. వీరిద్దరిని పర్సనల్ శత్రువులుగా చూస్తున్నారు. వైసీపీని ఓడించడం పక్కన పెడితే..వీరిని మాత్రం ఖచ్చితంగా ఓడించాలనే కసితో మాత్రం తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీలని ఎలాగైనా ఓడించాలని మాత్రం చూస్తున్నారు.ఇక ఈ ఇద్దరినే ఎందుకో చెప్పాల్సిన పని లేదు. వారు ఏ విధంగా చంద్రబాబుని, లోకేష్‌ని ఎలా తిడతారో అందరికీ తెలిసిందే. దారుణంగా బూతులతో విరుచుకుపడతారు. కానీ కొంతకాలం నుంచి కొడాలి-వంశీలు హద్దులు దాటేసి మరీ..చంద్రబాబు భార్య..భువనేశ్వరి గురించి దారుణంగా మాట్లాడుతూ వచ్చారు. నారా లోకేష్ ఎవరికో పుట్టారని మాట్లాడి…పరోక్షంగా భువనేశ్వరిపై దారుణంగా మాట్లాడారు. ఈ విషయంలో ఒకసారి చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకొచ్చి..మళ్ళీ సీఎం అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి..బయటకొచ్చి మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.అప్పుడు కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సరే అంతటితో ఆ రచ్చ ఆగిపోయింది అనుకుంటే..తాజాగా కొడాలి నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భారతి బిజినెస్ సన్నిహితులు..ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై కౌంటర్‌గా కొడాలి…నారా లోకేష్ ఎవరికి పుట్టారో తెలియదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు.దీనిపై టీడీపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. కొడాలిని తెగ తిడుతున్నారు. కృష్ణా జిల్లా నేతలు..కొడాలి టార్గెట్ గా బూతులు తిడుతున్నారు. అలాగే కొడాలి, వంశీలని నెక్స్ట్ ఓడించి తీరుతామని సవాళ్ళు చేస్తున్నారు. అయితే కొడాలి, వంశీలని ఓడించడం ఈజీ కాదు. ఇటీవల సర్వేల్లో ఆ రెండు చోట్ల వైసీపీ గెలుస్తుందని తేలింది. అదే సమయంలో గుడివాడ, గన్నవరంల్లో కొత్త అభ్యర్ధులని పెట్టాలని టీడీపీ చూస్తుంది. మరి ఈ సారి కొడాలి-వంశీలకు టీడీపీ చెక్ పెట్టగలదో లేదో చూడాలి.

Related Posts