YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాపం... కాంగ్రెస్...దారెటు

పాపం... కాంగ్రెస్...దారెటు

హైదరాబాద్, నవంబర్ 21,
తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి.. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్నప్పటికి.. దానిని ఉపయోగించుకుని ముందుకెళ్ల లేకపోతుందనే అపవాదు హస్తం పార్టీపై పడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికి.. పార్టీలో నాయకులను సమన్వయం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి.. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టీపీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై ఎంతోమంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేసుకుంటూ ముందుకు పోతుంటే మరికొంత మంది మాత్రం బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి.. తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొందరు నేతలు. మరికొంతమంది అయితే టికెట్ కమిట్ మెంట్ దొరికితే వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కలహాలు పెద్ద సమస్యగా మారింది. రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు కొందరు నాయకులు.తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడంపై సొంతపార్టీ నాయకుల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొత కాలం వేచిచూడాల్సిందని, కోమటిరెడ్డి బ్రదర్స్ అనేకసార్లు పార్టీ లైన్ దాటినా చర్యలకు వెనుకాడిన పార్టీ.. శశిధర్ రెడ్డి వ్యవహరంలో ఇంత తొందరగా ఎందుకు స్పందించాల్సి వచ్చిందని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చెన్నారెడ్డి సమావేశం ఏర్పాటుచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తప్పుబడుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే దానికి టీపీసీసీ చీఫ్ బాధ్యత వహించాల్సి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.మరోవైపు జూమ్ మీటింగ్ కు హాజరుకాలేదంటూ 11 మంది నాయకులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూమ్ మీటింగ్ లు పెట్టడానికి ఇది కంపెనీ కాదని, పార్టీ అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వారానికి ఒకసారి సమావేశం నిర్వహించాలని.. జూమ్ మీటింగ్ లు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతుంది.

Related Posts