YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఫైనల్ లోకి చెన్నై...డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన..!!

 ఫైనల్ లోకి చెన్నై...డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన..!!

ఫైనల్ లోకి ప్రవేసించిన చెన్నై సూపర్ కింగ్స్. నిన్న జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫై రెండు వికెట్లు తేడా తో చెన్నై గెలిచింది. డుప్లెసిస్‌ (42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 నాటౌట్‌) అసాధారణ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-11 ఫైనల్లోకి ప్రవేశించింది. ఇతడి ఆటతీరుతో విజయంపై ఆశలు లేని స్థితిలో నుంచి తేరుకున్న చెన్నై రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై నెగ్గింది. ఆఖర్లో శార్దుల్‌ ఠాకూర్‌ (5 బంతుల్లో 3 ఫోర్లతో 15 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (29 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 43 నాటౌట్‌) చెలరేగాడు. విలియమ్సన్‌ (15 బంతుల్లో 4 ఫోర్లతో 24), యూసుఫ్‌ పఠాన్‌ (29 బంతుల్లో 3 ఫోర్లతో 24) ఫర్వాలేదనిపించారు. బ్రావో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. రైనా (13 బంతుల్లో 4 ఫోర్లతో 22) ఫర్వాలేదనిపించాడు. సిద్ధార్థ్‌ కౌల్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మలకు రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ డుప్లెసి్‌సకు దక్కింది.

Related Posts