YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విజయరామారావు మృతిపట్ల మంత్రి తలసాని సంతాపం

విజయరామారావు మృతిపట్ల మంత్రి తలసాని సంతాపం

హైదరాబాద్
మాజీమంత్రి, మాజీ సిబిఐ  డైరెక్టర్ విజయ రామారావు మృతికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేసారు. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మంత్రిగా, అధికారిగా విజయ రామారావు అందించిన సేవలను స్మరించుకున్నారు. విజయ రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిసారు.

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, విజయరామారావు  మరణించారు. విషయం తెలియగానే  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మల్యే మాగంటి గోపీ నాథ్ తదితరులు. బంజారా హిల్స్ లోని అయన వారి ఇంటికి వెళ్ళి, వారి పార్థీవ దేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. వారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Related Posts