YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో హై స్పీడ్ ట్రైన్స్

తెలుగు రాష్ట్రాల్లో హై స్పీడ్ ట్రైన్స్

హైదరాబాద్, మార్చి 17, 
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్ పరుగులు పెడుతోంది. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఈ ట్రైన్ నడుస్తోంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరో వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. దాంతో పాటు సికింద్రాబాద్ నుంచి పుణే వరకు మరో ట్రైన్ నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇవే కాక.. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ప్రాథమిక కసరత్తును ప్రారంభించింది. హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో రెండు ప్రతిపాదిత మార్గాలు ఉన్నాయి.హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు ఒక మార్గం కాగా. కర్నూలు నుంచి విజయవాడ వరకు రెండోది. ఈ కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ రైలును పరుగులెత్తించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ఇంజినీరింగ్‌, ట్రాఫిక్‌ స్డడీ (పెట్‌) సర్వే మరో రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌ - విజయవాడ - విశాఖ రూట్ చాలా రద్దీగా ఉంటుంది. ఈ రూట్‌లో ఇప్పటికే ట్రాక్‌ సామర్థ్యానికి మించి ట్రైన్స్ రన్ నడుస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం చేరేందుకు సగటున 12 గంటల సమయం పడుతోంది. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో 10.30 గంటలు సమయం పడుతుండగా.. ఇటీవల ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో 8.30 గంటల సమయం పడుతోంది. ఈ కారిడార్‌లో గనుక హైస్పీడ్ ట్రైన్ అందుబాటులోకి వస్తే.. కేవలం నాలుగు గంటల్లోనే హైదరాబాద్‌ నుంచి వైజాగ్ చేరుకునే అవకాశం ఉంటుంది.శంషాబాద్ నుంచి హైదరాబాద్‌- విజయవాడ- వైజాగ్ మార్గంలో ట్రైన్ నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి నేరుగా, వేగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెళ్లేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖకు వెళ్లేందుకు వరంగల్‌, ఖమ్మం మీదుగా ఒక మార్గం, నల్గొండ, గుంటూరు మీదుగా మరో రైలు మార్గం అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం ఎంచుకుంటారనేది వేచి చూడాలి. రాయలసీమ ప్రాంతాల నుంచి విజయవాడకు రైలు ప్రయాణానికి ప్రస్తుతం ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి కర్నూలు వరకు మరో హైస్పీడ్‌ కారిడార్‌ కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమచారం. ఈ కారిడార్ ఓకే అయితే.. కర్నూలు నుంచి విజయవాడకు ఆపైన విశాఖపట్నం వరకు హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. అయితే ఈ రైల్వే కారిడార్లపై ఆరు నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Posts