YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ కు మద్దతుగా టీడీపీ ర్యాలీ

లోకేష్ కు మద్దతుగా టీడీపీ ర్యాలీ

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో టిడిపి శ్రేణులు భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టి శుభాకాంక్షలు తెలిపారు. దర్శి మండలం శామంతిపూడి నుండి దర్శి లోని టిడిపి కార్యాలయం వరకు ఏడు కిలోమీటర్లు భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టి నారా లోకేష్ కు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ... రాష్ట్రంలో లోకేష్ యువగళం పాదయాత్రతో వైసిపికి భయం పట్టుకుందన్నారు... దోచుకోవడం దాచుకోవడం తప్ప సీఎం జగన్ కు ఏమీ తెలియదు అన్నారు.. నవరత్నాలాంటూ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో చెప్పాలన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు...కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, చైర్మన్ పిచ్చయ్య టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts