
హైదరాబాద్
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి 10 వేల జరిమానా తెలంగాణ హైకోర్టు విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటీషన్ లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. 2018 కి చెందిన కేసులో ఇప్పటివరకూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేయక పోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో గొంగిడి సునీతకు 10 వేల రూపాయల జరిమానా హైకోర్టు విధించింది.తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబరు 3 లోగా కౌంటర్ దాఖలు చేయకుంటే, కౌంటర్ దాఖలుకు అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.