YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్గఢ్ లో పంజా విసిరిన నక్సలైట్లు

ఛత్తీస్గఢ్ లో  పంజా విసిరిన నక్సలైట్లు

దంతేవాడ
ఛత్తీస్గఢ్ లోని దంతేవాడలో శనివారం ఉదయం మావోయిస్టులు ఐఈడీ బాంబును పోలీసులే లక్ష్యంగా పేల్చారు. ఘటనలో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు, మరోక వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం శనివారం నుంచి డిసెంబర్ 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మావోయిస్టులు కరపత్రాలను విడుదల చేశారు. కొన్ని చోట్ల పోస్టర్లను అంటించారు. అప్రమత్తమైన జవాన్లు శనివారం ఉదయం పీఎల్జీఏ వారోత్సవాలకు సంబంధిచిన పోస్టర్లను ఆ ప్రాంతం నుండి తొలగించే సమయంలో జవాన్లు టార్గెట్ గా ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

Related Posts