![రహదారుల వెంట జలపాతాలు రహదారుల వెంట జలపాతాలు](https://www.yuvnews.com/telugu/admin/public/files/NOVEMBER%202023/rj.jpg)
తిరుపతి
తుపాన్ వలన రైల్వే కోడూరు - తిరుపతి వెళ్లే మార్గంలో కొండల నుంచి కిందకి వర్షం నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాల నుంచి నీళ్లు జాలువారుతున్నట్లు రహదారులపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరుతున్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను ప్రభావంతో 2 రోజులుగా వర్షాలు పడుతుండటంతో తాజా పరిస్థితి నెలకొంది.