YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ఖతార్ నుంచి ఖైదీల విడుదల

ఖతార్ నుంచి ఖైదీల విడుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13
భారత్ – ఖతార్‌ మధ్య దౌత్యం సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయి. గతేడాది మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్‌ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా వేసిన ఉరిశిక్షను రద్దు చేసి ఖతార్ ప్రభుత్వం జైలు శిక్షగా మార్చింది. ఖతార్‎లో బందీలైన నావికాదళ అధికారులను విడిపించాలని నౌకాదళ కుటుంబసభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరగా.. కేంద్రం ఖతార్ తో సంప్రదింపులు జరిపింది. దీంతో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను ఖాతార్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, వీరంతా 18 నెలలుగా వీరు అక్కడి జైల్లో ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పిస్తూ ఖతార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడుగురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఖతార్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తూ.. మంచి పరిణామమని పేర్కొంది.అయితే, ఖతార్ నుంచి ఎనిమిది మంది భారతీయ నావికాదళ అధికారుల విడుదలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. సోమవారం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘45 రోజుల క్రితం, వారి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా తగ్గించారు.. ఇప్పుడు, మన నేవీ అనుభవజ్ఞులను స్వదేశానికి తీసుకురావడం ద్వారా, అది రుజువు చేయబడింది. మోడీ ప్రభుత్వంలో ప్రతి ప్రాణం ముఖ్యం. అందుకే ఆపరేషన్ గంగాలో దాదాపు 27000 మంది భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుండి తరలించారు. నేపాల్ లేదా ఆఫ్ఘనిస్తాన్ .. ఇలా ఏదైనా యుద్ధంలో లేదా విపత్తు సంభవించిన ఏ దేశం నుంచి అయినా భారత ప్రభుత్వం వారిని సురక్షితంగా తీసుకువస్తోంది. గత 10 సంవత్సరాలలో ఏమి జరిగిందో అంతా గమనిస్తున్నారు.. ప్రపంచంలో భారతదేశం స్థాయి మరింత పెరిగింది…” అంటూ పేర్కొన్నారు.

Related Posts