YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలీసులపై మండిపడ్డ అఖిల ప్రియ

పోలీసులపై మండిపడ్డ అఖిల ప్రియ

అళ్లగడ్డ
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా మాజీ మంత్రి అఖిలప్రియ తన అనుచరులతో హల్చల్ చేశారు. ప్రజా సమస్యలపై,ముఖ్యంగా రైతు సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరిన అఖిలప్రియను శిరివెళ్ల పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో మాజీ మంత్రి అఖిలప్రియను శిరివెళ్ల పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన నన్ను గంగుల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో దాడులు చేయించాడని ఈ విషయమై నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళుతున్నానని,మరి పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, లేదా చూడాలని వ్యాఖ్యానించారు

Related Posts