YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 19, 20 తేదీల్లో కుప్పంలో నారా భువనేశ్వరీ పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

ఈ నెల 19, 20 తేదీల్లో కుప్పంలో నారా భువనేశ్వరీ పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

కుప్పం
కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్,కుప్పం టీడీపీ ఇంచార్జీ మునిరత్నం, డాక్టర్ సురేష్ మాట్లాడారు.
ఈ నెల 19 న మధ్యాహ్నం 12:33 నిమిషాలకు చంద్రబాబు తరపున భువనేశ్వరీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. లక్ష్మీపురంలో వెలసిన వరదరాజుల స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు జరుపుతారు. సాయంత్రం 5 గం.కు కుప్పం నియోజకవర్గంలోని ఇన్ఫ్లుఎన్సర్లతో సమావేశం వుంటుంది. ఈ నెల 20 న చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లిలో వెలసిన లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరీ పాల్గోంటారు. అన్నా క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. భువనేశ్వరి కుప్పం పర్యటనను విజయవంతం చేయండి. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి, చంద్రబాబుకు ఓటు వేయండి. కుప్పంలో చంద్రబాబు పై జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా గెలవరు. కుప్పంలో భరత్ గేలవరని అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఓడిపోయే వ్యక్తికి ఓటు వేయకండి. కుప్పం ప్రజలకు మేలు చేయాలన్నదే చంద్రబాబు ధ్యేయం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించండి కుప్పం ప్రజలందరూ చంద్రబాబుకు ఓటు వేసి బాబు రుణం తీర్చుకుందామని అన్నారు.

Related Posts