YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవనిగడ్డ నుంచి బరిలో ఐదుగురు

అవనిగడ్డ నుంచి బరిలో ఐదుగురు

విజయవాడ, ఏప్రిల్ 26
ఎన్నికల పుణ్యమా అని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల విశిష్టతలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే అందర్నీ ఆకర్షించింది కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఓ గ్రామం. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు అయినా ఆ గ్రామం ఎంతోమంది నాయకులను ఈ రాష్ట్రానికి అందించింది. ఆ గ్రామమే బందల రాయి చెరువు. చిన్నపాటి గ్రామమే అయినా.. ఈ ఎన్నికల్లో మాత్రం హైలెట్ గా నిలుస్తోంది. నేతల పుట్టినిల్లుగా గుర్తింపు సాధించింది.అవనిగడ్డకు సుదీర్ఘకాలం సింహాద్రి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన ఈ గ్రామానికి చెందిన వారే కావడం విశేషం. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర రావు ఇదే గ్రామానికి చెందినవారు. సింహాద్రి సత్యనారాయణ కుమారుడు కూడా. ప్రస్తుతం అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి రమేష్ బాబుది కూడా ఇదే ఊరు కావడం గమనార్హం. మరోవైపు సింహాద్రి తమన్నా అనే ట్రాన్స్ జెండర్ ఏకంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్నారు. తమన్నాది కూడా బందల రాయి చెరువు కావడం గమనార్హం. ఇలా ఆ గ్రామానికి చెందిన ముగ్గురు నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తుండడం విశేషం.ఈ గ్రామంతో మంత్రి అంబటి రాంబాబుకు విడదీయరాని బంధం. రాంబాబు అమ్మమ్మ ఊరు కూడా ఇదే. బాల్యంతో పాటు ప్రాథమిక విద్య కూడా రాంబాబు ఆ గ్రామం నుంచే పూర్తి చేశారు. ఇప్పటికీ ఆ గ్రామానికి తరచూ రాంబాబు వెళ్తుంటారు. మరోవైపు అంబటి రాంబాబు తమ్ముడు మురళీకృష్ణ పొన్నూరు నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నతో పాటు మురళీకృష్ణ సైతం ఈ గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఏపీ ఎన్జీవోల సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించి.. తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్సీ ని సొంతం చేసుకున్నారు పరుచూరి అశోక్ బాబు. ఆయనది సైతం ఇదే గ్రామం కావడం గమనార్హం. ఇలా ఎలా చూసుకున్నా నేతలను అందించిన గ్రామంగా బందల రాయి చెరువు ప్రత్యేక గుర్తింపు పొందింది.

Related Posts