YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోదీ హయంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు

మోదీ హయంలో 25  కోట్ల  మంది పేదరికం నుంచి బయటపడ్డారు

పెద్దపల్లి
పెద్దపల్లి జన సభ లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. పెద్దపల్లి గడ్డకు రావడం నా అదృష్టం,ఓదెలా మల్లన్న దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుట్టున్నాను. తెలంగాణ కు రైల్వే లైన్లు అభివృద్ధి చేయడం జరిగింది.. తెలంగాణకు మూడు వందే భారత్ రైళ్లు మంజూరు చేసాం. స్టీల్ ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో వుంది. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. ఏ బి సి పార్టీలు ముస్లిం ఏజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు... కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేస్తున్నారు. భారత జనతా పార్టీ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను ఘనంగా జరుపుకుంటున్నాం. మూడు పార్టీలు ముస్లిం ఎజెండాను మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీ ఉందా . పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ ఓటు వేసి భారీ మెజారిటీతో  గెలిపించాలని అన్నారు.

Related Posts