YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దుమారం రేపుతున్న నయవంచన పోస్టర్లు

 దుమారం రేపుతున్న నయవంచన పోస్టర్లు

హైదరాబాద్, ఏప్రిల్  26
హైదరాబాద్ లోని అనేక బహిరంగ ప్రదేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. వీటిని సామాన్యులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బీజేపీకి వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ రూపంలో వీటిని విడుదల చేసింది. గాంధీభవన్ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ పోస్టర్లను విడుదల చేశారు. ఈ ప్రజా చార్జిషీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు మాట్లాడారు. కొద్దిమంది తన స్నేహితులు, క్రోనీ క్యాపిటల్స్ కు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని భట్టి అన్నారు. జనాభాను కులాలు మతాలుగా విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని.. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం దాడి చేసి సంపదను దోచుకునేదని.. ప్రస్తుతం ఈ దేశంలో మోదీ హయాంలో అదే ధోరణి కొనసాగుతోందని భట్టి ఆరోపించారు.గత పదేళ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో చూశాం. రాబోయే ఎన్నికల్లో  గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ గతంలో హామీ ఇచ్చారు. కానీ గత పదేళ్లలో ఈ హామీని అమలు చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా పేరుకుపోయిన భారతీయుల నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేదవాళ్ల అకౌంట్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ దేశంలో ఏ ఒక్క పేదవాని అకౌంట్లో 15 లక్షలు జమ కాలేదు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీని అరికడతామని చెప్పారు. పదేళ్లయినా ఈ హామీకి సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.ప్రధాని మోదీ తన కొద్దిమంది క్రోనీ క్యాపిటల్స్ స్నేహితుల కోసం విదేశీ సంపదను ఎలా దోచిపెడుతున్నాడో యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి వివరంగా ఈ దేశ ప్రజలకు చాటారు. దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టాలని చూసే మోదీ ప్రభుత్వం ఓవైపు.. కుల గణన చేసి అధిక శాతం ఉన్న జనాభాకు ఈ దేశ సంపదను పెంచాలని రాహుల్ గాంధీ మరోవైపు ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారు’’ అని భట్టి తెలిపారు.రాజ్యాంగం, లౌకికవాదం, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని భట్టి తెలిపారు. లౌకికవాదం ప్రజాస్వామ్యం ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మీడియా ముందుకు రావాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. చార్జ్ షీట్ లో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి పౌరునికి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ సైన్యం కృషి చేయాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు.

Related Posts