YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ పార్టీ  అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

కాంగ్రెస్ పార్టీ  అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

- మేఘాలయలో 57 మంది అభ్యర్థులు..

- త్రిపురలో 56 మంది అభ్యర్థులు

- అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ

 మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మేఘాలయలో 57 మంది అభ్యర్థులు, త్రిపురలో 56 మంది అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్రిపురలో ఫిబ్రవరి 18న పోలింగ్ జరుగునుండగా, ఫిబ్రవరి 27న మేఘాలయలో పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న రెండు రాష్ట్రాల ఓట్లను ఒకేసారి లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మేఘాలయ, త్రిపురలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉండగా, మేఘాలయ అసెంబ్లీ గడువు మార్చి 6తోనూ, త్రిపుర అసెంబ్లీ గడువు మార్చి 14తోనూ ముగియనుంది.

Related Posts