YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ అధికారుల గొంతు కోస్తా..

ఆ అధికారుల గొంతు కోస్తా..

- కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్.కె.సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

అవినీతి అధికారుల గొంతు కోస్తానంటూ హెచ్చరించారు. బీహార్‌లోని తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామాభివృద్ధి ప్రచార కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ అధికారులకు ఈ హెచ్చరికలు చేశారు. గ్రామాల్లో పనులను పారదర్శక టెంటర్ ప్రక్రియ ద్వారా అధికారులు కేటాయించాలని సూచించారు. 'స్కీముల వల్ల ప్రజలందరికీ లబ్ధి చేకూరాలి. టెండర్, కన్‌స్ట్రక్షన్‌ విషయాల్లో పారదర్శకత ఉండాలి. అధికారులు ఏ పని చేపట్టినా అది నా పేరుతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఎలాంటి తప్పిదాలు జరిగినా దానికి కారణమైన వారి మెడలు కోస్తా. వారిపై కేసులు నమోదు చేస్తా. జైలుకు పంపుతా' అంటూ మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) సీనియర్ స్థాయి అధికారులు, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Related Posts