YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రణబ్ ముఖర్జీ ని తప్పుపట్టిన కూతరు శర్మిష్ట

ప్రణబ్ ముఖర్జీ ని తప్పుపట్టిన కూతరు శర్మిష్ట
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరుకావడంపై పెద్ద దుమారమే రేగుతోంది. అటు కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తుంటే.. ప్రణబ్ కూతురు శర్మిష్ట కూడా తండ్రిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ముందుగానే ఊహించిందే జరిగిందంటూ బాధను తెలియజేసింది. తండ్రి ఫోటోను మార్ఫ్ చేయడంపై ట్విట్టర్‌లో మండిపడింది. 'చూశారా.. నేను దీని గురించే భయపడ్డా.. మా నాన్నను కూడా ముందే హెచ్చరించా.. ఆయన మాట్లాడి కొన్ని గంటలైనా కాలేదు.. అప్పుడే బీజేపీ, ఆరెస్సెస్ ట్రిక్స్ డిపార్ట్‌మెంట్ ఫుల్ స్వింగ్‌లో పనిచేస్తోంది' అంటూ మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేశారు శర్మిష్ట. ప్రణబ్ నిన్న ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనగా.. ఆయన మార్ఫింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో వేదికపై ఉన్న ఆరెస్సెస్ నేతలంతో ప్రతిజ్ఞ చేస్తూ.. సెల్యూట్ చేశారు. అయితే ప్రణబ్ మాత్రం మామూలుగా లేచి నిలబడ్డారు. కాని ఓ ఫోటోలో మాత్రం ఆయన కూడా సెల్యూట్ చేస్తున్నట్లు మార్ఫింగ్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కూడా ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడాన్ని తప్పుబట్టింది. మాజీ రాష్ట్రపతి ప్రసంగంపై ఆ పార్టీ నేతలు రగిలిపోతున్నారు. దశాబ్దాల పాటూ కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన.. ఇలా చేయడం సరికాదంటూ ట్వీట్లు చేశారు. ప్రణబ్ దాదా నుంచి ఇలాంటిది నేను ఊహించలేదంటూ అహ్మద్ పటేల్ కూడా స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. లక్షల మంది కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద శర్మ కూడా వ్యాఖ్యానించారట. 

Related Posts