YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శాఖల కేటాయింపుల్లో కాంగ్రెస్‌కు అన్యాయం కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే

శాఖల కేటాయింపుల్లో కాంగ్రెస్‌కు అన్యాయం         కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్‌లో శాఖల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తులు ఉన్న మాట నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. మాకు (కాంగ్రెస్‌కు) అన్యాయం జరిగింది. దానిని సరిచేయాల్సి ఉంది అని ఆయన అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ హోం మంత్రిత్వ శాఖ దక్కలేదని ఫిర్యాదు చేసిన వారు సైతం పార్టీకి విధేయులుగా ఉంటామని, పార్టీని వీడి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పినట్టు పేర్కొన్నారు.రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక్కోసారి మనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఖర్గే పేర్కొన్నారు. కొందరు సభ్యులు అసంతృప్తితో ఉన్నందున అధిష్ఠానం. వారి ప్రతినిధులు తప్పనిసరిగా వారితో మాట్లాడాల్సి ఉంటుందన్నారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కారణం మాత్రం ఉంటుందని ఖర్గే వివరించారు.

Related Posts