YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టీ20కి ఎంపికైన భారత జట్టు..

టీ20కి ఎంపికైన  భారత జట్టు..

-  ఫిబ్రవర్‌ 1 నుంచి వన్డేల సిరీస్‌ ప్రారంభం..

- ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్నవన్డే జట్టు

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికైంది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 18, 21, 24 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవర్‌ 1 నుంచి ఇరు జట్ల మధ్య ఆరు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం వన్డే జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకుంది. 
భారత జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, ధోని, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, జయదేవ్‌ ఉనద్కత్‌, శార్దుల్‌ థాకూర్‌.

Related Posts