YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నవ నిర్మాణ దీక్షలతో డ్రామాలు

 నవ నిర్మాణ దీక్షలతో డ్రామాలు
నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఏంచేశారని వైకాపా నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అన్నారు. బుధవారం నాడు అయన తెనాలి మండలం బుర్రిపాలెంలో  మీడియాతో మాట్లాడారు.  నవ నిర్మాణ దీక్షలతో డ్రామాలు ఆడుతూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు.  చంద్రబాబు ప్రభుత్వం అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే కేంద్రంతో పాటు ప్రతిపక్షాలపై విమర్శలు  చేస్తున్నారని అయన అన్నారు.  ప్రత్యేక హోదా కోసం మొట్ట మొదటి నుండి పోరాడుతుంది వైసీపీనే.  పోలవరం కోసం చంద్రబాబు చేసిందేం లేదు...ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ఘనత వైయస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు.  కుట్రలు,మోసాలకు పెట్టింది పేరు చంద్రబాబు.  ఎన్నికలు సమీపిస్తుండటంతో అభధ్రతా భావంతో ప్రతి పక్షాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశించిన చోట నుండి పోటీ చేస్తానని అన్నారు.  మహేష్ బాబుకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేసారు. 

Related Posts