YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోలుకున్న వాజ్ పేయి

 కోలుకున్న వాజ్ పేయి
మాజీ ప్రధానమంత్రి, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కిడ్ని సమస్యతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గడిచిన 48 గంటల్లో వాజ్‌పేయి ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. కిడ్ని పనితీరు తిరిగి మామూలు స్థితికి చేరుకుందన్నారు. గుండె పనితీరు, రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని.. ఎటువంటి లైఫ్ సపోర్ట్ లేకుండా పనిచేస్తున్నాయని చెప్పారు. మరికొన్ని రోజుల్లో వాజపేయి పూర్తిస్థాయిలో కోలుకుంటారని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.

Related Posts