
హైదరాబాద్
జూబ్లీహిల్స్ క్లబ్లో సిద్దార్థ్ ఫైన్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్లోనీ నటి నమ్రతా శిరద్కోర్ పాల్గోన్నారు. తనకు సంప్రదాయ నగలంటే ఎంతో ఇష్టమని, కానీ అప్పుడప్పుడు అవసరానికి తగినట్లు మోడ్రన్ నగలు కూడా ధరిస్తుంటానని ప్రముఖ నటి, మహేష్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అన్నారు. జూబ్లీహిల్స్ క్లబ్లో సిద్దార్థ ఫైన్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ సిద్దార్థ్ ఫైన్ జ్యువెలర్స్ డిజైనర్ నాగిని ప్రసాద్ వేమూరి రూపొందించిన భిన్న రకాల ప్రత్యేక కలెక్షన్స్ను ఆమె పరిశీలించారు. వెడ్డింగ్ కలెక్షన్స్ పాటు ఫెస్టివల్ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచినట్లు రెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు కృష్ణ ప్రసాద్ వేమూరి తెలిపారు.