YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత దేశం.

మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత దేశం.

హైదరాబాద్
హైదరాబాద్ బీజేపీ నగర కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గోన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళల సమస్యలను అధిగమించి, మహిళా సమాజాన్ని ఎలా ప్రోత్సహించాలనే అంశంపై ప్రపంచం ముందుకు వెళ్తోంది.  ప్రధాని నరేంద్ర మోదీ, , బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా  పిలుపు మేరకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.  మహిళలు సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.  మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత దేశం.  ఫైటర్ విమానాలు నడపడంలో, పైలట్లుగా, స్పేస్ టెక్నాలజీ రూపకల్పనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాంకుల్లో, పోలీసు రంగంలో, రెవెన్యూ, ఉపాధ్యాయులుగా, ఐటీ రంగంలో ఇలా ఏ రంగంలో చూసినా మహిళలు చాలా నమ్మకంతో, ధైర్యంతో, అంకిత భావంతో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో లక్షలాది మంది ఆడబిడ్డలు ఐటీ రంగంలో కీలక పాత్రపోషిస్తున్నారు. ఏ రంగంలో కూడా వివక్ష ఉండకూడదని, ఆర్మీలో కూడా మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ  అవకాశం కల్పించారు. భగభగమండే ఎండలో, ఎముకలు కొరికే చలిలో కూడా దేశ సరిహద్దుల్లో ఏకే 47 పట్టుకుని మహిళా జవాన్లు పహారా కాస్తున్నారు.  రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందు ఉండాల్సిన అవసరం ఉందని, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ నడుం బిగించారు.ఏ కాంగ్రెస్ ప్రధాని కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ధైర్యం చేయలేదు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రమే లోక్ సభ, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు తీసుకొచ్చి ఆమోదింపజేశారు.అన్ని విషయాల్లో కూడా ప్రధాని మోదీ గారు మహిళలను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలను పోత్సహించేందుకు డ్రోన్ దీదీ పథకం ద్వారా డ్రోన్లను అందించారు.రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ముస్లిం మహిళలకు అనేక హక్కులు ఉండేవి కావు.
త్రిపుల్ తలాక్ ను రద్దు చేసే ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ నరేంద్ర మోదీ   మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, త్రిపుల్ తలాక్ ను రద్దు చేసి, ముస్లిం మహిళల కళ్లల్లో ఆనందం చూశారు.
దేశం గర్వించదగ్గ శాస్ర్తవేత్త అబ్దుల్ కలాంను రాష్ర్టపతిని చేసిన ఘనత బీజేపీది. మరో సారి రాష్ర్టపతిని చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను, మూడోసారి గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిగా చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది.
మహిళలు ఎవరూ భయపడొద్దని, గట్టిగా నిలబడాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్ష. ఆడ బిడ్డలందరికీ అండగా నిలబడతానని ఆయన మాటిచ్చారు.
వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తున్నారు.
పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీగారు.
దేశంలో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాదం, తీవ్రవాదం అనే మాట వినిపించట్లేదు.దేశం మొత్తం శాంతి భద్రతలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత జమ్మూ, కశ్మీర్ లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారు. 370 అధికరణ తీసేశాం.ఎలాంటి ఘర్షణ లేకుండా అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నాం.దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉండాలి.ఆత్మ నిర్భరత సాధించాలంటే మహిళలు కీలక పాత్ర పోషించాలి.2047 నాటికి దేశంలోని ప్రతి మహిళకు సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్గా మారుతుంది. మోదీ  ప్రధాని అయిన వెంటనే మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ది.దేశంలోని మహిళల సాధికారతను మరింత పెంచేలా, దేశ ధర్మాన్ని కాపాడే శక్తిని నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. బస్తీల్లో పొదుపు సంఘాలను ప్రోత్సహించే దిశగా మహిళా మోర్చా కార్యకర్తలు కృషి చేయాలి. పొదుపు సంఘం అంటే ఆత్మ విశ్వాసం అనే విషయం గుర్తుంచుకోవాలి.  పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తోందని అన్నారు.

Related Posts