YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోజుకో మలుపు తిరుగుతున్న టీటీడీ అర్చక వివాదం

 రోజుకో మలుపు తిరుగుతున్న టీటీడీ అర్చక వివాదం
టీటీడీలో అర్చకత్వ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆలయ ప్రధాన అర్చకులుగా ఈ మధ్యే నియమించబడిన వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజుల దీక్షితులు కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ నియామకంపై ఇచ్చిన ఆర్డర్స్‌కు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని.. అలాగే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. దానికి అనుకూలంగానే ప్రభుత్వం నియామకాలు చేసిందని కూడా తెలిపారట. ఈ ఇద్దరు అర్చకుల తరపున లాయర్ కోర్టును ఆశ్రయించారు. టీటీడీ చేపట్టిన నియమాకాలను కూడా రాజకీయం చేయడం తగదని.. అందుకే ప్రధాన అర్చకులు ముందుగానే కోర్టులో పిటిషన్ వేశారంటున్నారు ఆయన. ఈ పిటిషన్‌కు 90రోజుల గడువు ఉంటుందని.. ఆలోపు ఎవరైనా ఈ నియామకాలపై కోర్టును ఆశ్రయిస్తే తమకు తెలియజేయాలని ప్రధానంగా కోరామన్నారు. అలాగే ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వొద్దని ప్రస్తావించామని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులకు 65 ఏళ్లకు రిటైర్మెంట్‌ కావాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు రిటైర్ కావాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని దీక్షితులు తీవ్రంగా వ్యతిరేకించారు. తరతరాలుగా వస్తున్న అర్చక వారసత్వం విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం ఎవరికీ లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తానన్నారు. కాని అంతకంటే ముందే ఆలయ ప్రధాన అర్చకులు కోర్టును ఆశ్రయించారు.

Related Posts