YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండు తెలుగు రాష్ట్రాలను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి

రెండు తెలుగు రాష్ట్రాలను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి

విజయవాడ, మార్చి 10, 
రెండు తెలుగు రాష్ట్రాలను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి. కుటుంబ రాజకీయాలే ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల్లోనే ఇది ఎక్కువగా ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఇది కొద్దిగా దూరమయినప్పటికీ ప్రాంతీయ పార్టీలు మాత్రం వారసత్వ రాజకీయాలు అందిపుచ్చుకుంటున్నాయి. వారిదే హవా నడుస్తుంది. వారికే పార్టీ పగ్గాలయినా.. ప్రభుత్వ పదవులయినా.. పార్టీ జెండా మోసిన వారిని కాకుండా కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ తప్పదు. వారు లేకుంటే నాయకత్వం లేదు. వారి వల్లనే పార్టీ నిర్మాణం దగ్గర నుంచి అవసరమైన అన్ని పనులు జరుగుతుండటంతో వారిని విస్మరించి, కాదని వేరే ఏమీ చేయలేని పరిస్థితి పార్టీ అధినేతలది తెలంగాణలో బీఆర్ఎస్ ఫక్తు కుటుంబ పార్టీగా ముద్ర పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు. మేనల్లుడు హరీశ్ రావు మంత్రిగా ఉన్నారు. కుమార్తె కల్వకుంట్ల కవిత రాజ్యసభ, పార్లమెంటు లేదంటే ఎమ్మెల్సీగానో పదవులు పొందారు. ఇక కేసీఆర్ సోదరుడు మేనల్లుడు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇలా అందరూ వాళ్లే. ఇదే పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమయిందన్న విశ్లేషణలు వినపడ్డాయి. అయినా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నలుగురే పార్టీని నడుపుతన్నారు. అంతకు మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే వందల కోట్ల రూపాయల నిధులున్న పార్టీ బాధ్యతలను వేరే వారికి అప్పగించే సాహసాన్ని గులాబీ బాస్ చేయరనే చెప్పాలి.ఇక తెలుగుదేశం పార్టీలో కూడా ఏపీలో ఫక్తు వారసత్వ రాజకీయాలను నడుపుతుంది. మొన్నటి ఎన్నికల్లో ఐదు టిక్కెట్లు ఆ కుటుంబానికే దక్కాయి. చంద్రబాబు, లోకేశ్, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంద్రీశ్వరి, శ్రీభరత్ లు టిక్కెట్లు పొంది చట్టసభలకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలోనూ నారా కుటుంబం నుంచి ఇద్దరున్నారు. పార్టీ పదవులను కూడా వారిద్దరే చూసుకుంటున్నారు. దీంతో ఒక కుటుంబం చేతిలోనే పార్టీ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే విపక్ష నేత వైసీపీ అధినేతజగన్ కూడా అదే తరహా రాజకీయాల నుంచి వచ్చారు. తండ్రి వైఎస్ వారసత్వరాజకీయాలను అందుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ పనిచేస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ బంధువులు అనేక మంది టిక్కెట్లు పొందారు. పదవులు సాధించుకున్నారు. ఇలా ఈ రెండు పార్టీలూ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేసినట్లే కనపడుతుంది.  ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయినా వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారని భావిస్తే, ఆయన కూడా తనకుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న కామెంట్స్ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. నాదెండ్ల భాస్కర్ రావు వారసత్వాన్ని రాజకీయంగా ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ అందిపుచ్చుకున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పోస్టుకు నాగబాబు నామినేషన్ వేయడంతో కొణిదల కుటుంబంలో మూడో వ్యక్తి పదవి పొందేందుకు రెడీ అయినట్లే. పార్టీ కోసం కష్టపడ్డారన్న పేరు మీద నాగబాబును ఎంపిక చేయడంతో మరోసారి వారసత్వ రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నాగబాబు కూడా మంత్రి అయితే ఒకే కుటుంబం నుంచి కేబినెట్ లో ఇద్దరు ఉన్నట్లే అనుకోవాలి. వారసులకు తప్ప పోస్టుల ప్రాధాన్యత మరెవ్వరికీ లేదన్నది వాస్తవం.

Related Posts