YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం సారు

విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం సారు

విజయనగరం
బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. హెడ్ మాస్టర్ రమణ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసారు. 'మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమి చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు' అంటూ విద్యార్థులు వద్ద  ఆవేదన వ్యక్తం చేసారు. ఉదయం ప్రార్థన సమయంలో రమణ  సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసారు. మాకు చేతనైన వరకు మేం చేస్తున్నాం.. మీ పిల్లల్నీ మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృథా అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులును ఉద్దేశించి  వాపోయారాయన.

Related Posts