
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న ఆరు పథకాలు అమలుపరచలేదని పెద్ద ఎత్తున మహిళల నుండి దరఖాస్తులను సేకరిస్తున్న బిజెపి శ్రేణులు ఈ కార్యక్రమంలో మునుగోడు బిజెపి కన్వీనర్ దూడలబిక్షం, శాగ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
తరువాత బీజేపీ నాయకులు మాట్లాడుతూ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా ఆరు పథకాలు అమలు పరచాలని మరియు ఆసరా పింఛన్లు 4000 రూపాయలు మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్న అమలుపరచలేదని దానికి నిరసనగా మునుగోడు నియోజకవర్గంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో దరఖాస్తుల స్వీకరిస్తున్నాం ఈ కార్యక్రమానికి మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది... కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమలుపరిచే వరకు బిజెపి పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలిపారు.....