
నకిరేకల్
నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఈ నెల 21న లీకైన పదవ తరగతి తెలుగు పేపర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో నకిరేకల్ అధికార పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులను వదిలేశారంటు బిఆరెస్ నాయకులు చేసిన ఆరోపణలపై దూమారం లేస్తుంది. కేటీఆర్ ట్విట్ చేసిన అంశాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. బిఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫై నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్సి ఎస్టీ కేసు తో పాటు మరో రెండు కేసులు నమోదు చేశారు.అధికార పార్టీ తీరును బిఆరెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. నకిరేకల్ మాజీ బిఆరెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పందిస్తూ పదవ తరగతి పేపర్ లీక్ వ్యవహారం లో పోలీసులు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులను ఎందుకు వదిలేశారో చెప్పాలంటూ మీడియా ముఖంగా ప్రశ్నించారు.తమ నాయకునిపై తప్పుడు కేసులు పెడితే బయపడబొమని,కోర్ట్ లపై తమకు నమ్మకం ఉందని అన్నారు..