YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాతబస్తీలో ఎంఐఎంను ఎదుర్కోంటాం

పాతబస్తీలో ఎంఐఎంను ఎదుర్కోంటాం

హైదరాబాద్
పాతబస్తీలో ఎంఐఎం ఆగడాలు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ భాగ్యనగర్ జిల్లా నూతన అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ అన్నారు.  కుర్మగూడ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం నేతలు కనుసన్నల్లో ప్రభుత్వం, కొందరు అధికారులు వ్యవహరిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పను ల్లో సైతం పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని అడుకుంటే బీజేపీ చూస్తూ ఉరుకోదని హెచ్చ రించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో అధిక డివిజన్లలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు సమష్టి కృషి చేస్తామని చెప్పారు.  ప్రధాని మోదీ  చేపడుతున్న ప్రభుత్వ పథకాలలో ప్రజలలోకి మరింతగా తీసుకు వెల్లుతామని చెప్పారు..కార్యక్రమంలో   మాజీ కార్పొరేటర్  సహదేవ్ యాదవ్ .నేతలు  మహేష్, యూగేందర్.ప్రమోద్. నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts