
రంగారెడ్డి
పేదల ఇండ్ల స్థలాల రామోజీ ఫీల్మ్ సిటీ యాజమాన్యం కబ్జా చేసిందంటూ రామోజీ ఫీల్మ్ సిటీని ఇండ్ల స్థలాల లబ్దిదారులు ముట్టడించారు. లబ్దిదారులకు సిపీఎం మద్దతు నిలిచింది.
రంగారెడ్ది జిల్లా ఇబ్రాహీంపట్నం. మండలంలోని నాగాన్ పల్లి లో సర్వే నెంబరు 189.203 లలో రామోజి యాజమాన్యం కబ్జా చేసినా పేదల ఇంటి స్థలాలను ఇవ్వాలని సీపీఎం అద్వర్యంలో చలోరామోజీ ఫిల్మ్ సిటీ కార్యక్రమం నిర్వహించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జన్ వెస్లీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. రామోజి ఫిల్మ్ సిటీ ఆధీనం లో ఉన్నా ఇండ్ల స్థలాలు భూములను పేదలకు ఇవ్వాలని ఆర్ఎఫ్సీ ఇంటి స్థలాల కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఫీలిం సిటీ గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్ళిన లబ్దిదారులు, .తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో భీష్మించు కుర్చున్నారు.