
హైదరాబాద్
ఉప ముఖ్యమంత్రి భట్టి తోని నాకు 16 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది సభలో కలిసి పని చేస్తున్నాము. నేను తొలిసారి సభకు వచ్చినప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆయన పట్ల ఎప్పుడూ గౌరవం ఉన్నది.. మాకు ఆయనను పెద్దన్న లెక్క గౌరవిస్తాం. కానీ ఆది శ్రీనివాస్ ఇప్పుడు లేచి అనవసరమైన అన్ని అంశాలు మాట్లాడుతున్నారు. నేను అనలేనా ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అని. 20% 30% కమిషన్ ప్రభుత్వం అని నేను అనలేను. కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నరు. చర్య తీసుకోమని అడిగాను. పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి 50 కోట్లకు కొన్నారని మంత్రి కోమటిరెడ్డి మాటలను నేను అనవచ్చు కూడా . అనవచ్చు కదా అని అన్నారు.
సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన ఉపముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్
అసెంబ్లీలో బిఅర్ఏస్ సభ్యులు నిరసనకు దిగారు. సచివాలయంలో కమీషన్లపై, కాంట్రాక్టర్ల దర్నా గురించి కెటిఅర్ ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి వోళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మాట్లాడారంటూ అనుచితంగా వ్యాఖ్యాలు చేశారని, భట్టి వాఖ్యలపైన క్షమాణనకు డిమాండ్ చేసారు బిఅర్ఏస్ సభ్యులు. సభలో బిఅర్ఏస్ సభ్యుల నినాదాలు చేసారు. భట్టి వేంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణ చేప్పాలని సభ్యులు పట్టుపట్టారు. వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ.. అంటూ.. అసెంబ్లీ మెట్ల వద్ద బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కు దిగారు. ఇది పర్సంటేజ్ లా పాలన అంటూ నినాదాలు చేసారు. ఇదేమి ప్రభుత్వం.. 20 శాతం, 30 శాతం పర్సంటెజీల ప్రభుత్వం అని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజం ఎత్తారు. ఉద్యోగుల బిల్లుల కోసం పర్సంటేజీలా సిగ్గు సిగ్గు అని అన్నారు.